మరో ఇరవై ఏళ్ల పాటు అధికారం టీఆర్ఎస్‌దే – ఎమ్మెల్యే జోగు రామన్న

by  |
jogu-ramann
X

దిశ, అదిలాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కారు జోరు కొనసాగుతుందని..మరో 20 ఏళ్ల పాటు కారు అధికారంలో ఉంటుందని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలోని వార్డ్ నెంబర్ 25 లో రూ. 30 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు భూమిపూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆదిలాబాద్ మున్సిపాలిటీ అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందన్నారు. ఎన్నికల సమయంలో కోట్ల రూపాయల నిధులను పార్టీలకతీతంగా కేటాయించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ శైలజ, అవార్డుల కౌన్సిలర్లు, నాయకులు అధికారులు పాల్గొన్నారు



Next Story

Most Viewed