తెలంగాణ సమాజం గౌరవించుకోవాల్సిన వ్యక్తి అంజయ్య: గవర్నర్ దత్తాత్రేయ

by  |
governor-dhatthareya,-1
X

దిశ, ముషీరాబాద్: తెలంగాణ సమాజం గుర్తుంచుకుని గౌరవించుకోవాల్సిన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి, కార్మిక నాయకుడు టి.అంజయ్య అని పలువురు నాయకులు కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య 35వ వర్థంతిని పురస్కరించుకొని ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంజయ్య విగ్రహం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో హరియానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కాంగ్రెస్ నాయకులు వి.హనుమంతరావు, ముదిరెడ్డి కోదండరెడ్డి, నిరంజన్, టీఆర్ఎస్ నాయకులు ఎమ్. ఎన్. శ్రీనివాసరావు, జీ.ఎన్. కేశవ్, భీమ్, బీజేపీ నాయకులు నవీన్ గౌడ్, అనీల్, అంజయ్య కుటుంబ సభ్యులు, పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అంజయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాలులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ కార్మికుడి నుంచి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన గొప్ప నాయకుడని, 1969 తెలంగాణ ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారని గుర్తు చేసుకున్నారు.

Next Story