కరోనా పోవాలంటూ ఆ ఊరిలో జంతు బలి..

by  |
కరోనా పోవాలంటూ ఆ ఊరిలో జంతు బలి..
X

దిశ, మహబూబాబాద్ : ఈ అత్యాధునిక ప్రపంచంలో ఓ వైపు అంతరిక్షంలోకి శాటిలైట్లు పంపుతున్నా.. కొందరు మాత్రం మూఢనమ్మకాలను వదలడం లేదు. ఇటీవల కరోనా దేవత అంటూ ఓ ఊరి ప్రజలు పూజలు చేసిన విషయం తెలిసిందే. అయితే అలాంటి సంఘటనే మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని బోటి తండాలో కరోనా కేసులు పెరుగుతుండగా తండాకు అరిష్టం వచ్చిందని, కీడు సోకిందని సోమవారం గ్రామంలో గిరిజనులు జంతువులను బలిచ్చారు. గిరిజనులు వారి కులదైవాలకు మొక్కులు చెల్లిస్తే కరోనా తగ్గుముఖం పడుతుందని, తండా మధ్యలో వేప ఆకులు, నిమ్మకాయలు, పసుపు, కుంకుమలు పెట్టి పూజలు నిర్వహించారు.


Next Story

Most Viewed