'ప్రేక్షకులూ… సరిలేరు మీకెవ్వరూ'

by  |
ప్రేక్షకులూ… సరిలేరు మీకెవ్వరూ
X

‘సరిలేరు నీకెవ్వరు’ .. బ్లాక్ బస్టర్ కా బాప్. మహేష్ బాబు, రష్మిక మందన్నా హీరో హీరోయిన్లుగా నటించిన సినిమాలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్రలో కనిపించారు. సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ సినిమా నేటితో 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ అనిల్ రావిపూడి సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. మరో మర్చిపోలేని సంక్రాంతి అందించిన ‘ప్రేక్షకులూ… సరిలేరు మీకెవ్వరూ’ అంటూ ధన్యవాదాలు తెలిపారు.

సూపర్ స్టార్‌ మహేష్ బాబుతో చేసిన ప్రయాణాన్ని జీవితంలో మర్చిపోలేను అని…. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ఎప్పటికీ నాకు ప్రత్యేకమని తెలిపారు. ‘టేక్ ఏ బో’, ‘నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్’, ‘మీకు అర్ధమవుతుందా’, ‘రమణా.. లోడ్ ఎత్తాలి రా’ లాంటి డైలాగ్స్ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయాయని… ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో ఈ డైలాగ్స్ వినపడుతున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. మీరు మనస్ఫూర్తిగా నవ్విన నవ్వులు.. బాక్సాఫీస్ వద్ద మాకు కనక వర్షాన్ని కురిపించాయన్నారు అనిల్.

‘బాధ అయినా గాయం అయినా తట్టుకునే శక్తి ఆడవాళ్లకు మాత్రమే ఉంది… అందుకేనేమో దేశాన్ని అమ్మతో పోల్చుతారు’ అనే డైలాగ్‌కు మీ నుంచి వచ్చిన రెస్పాన్స్‌కు కృతజ్ఞున్ని అంటూ ట్వీట్ చేశారు అనిల్ రావిపూడి. మీరు ‘సరిలేరు నీకెవ్వరు’పై చూపించిన అభిమానంతో డిస్ట్రిబ్యూటర్లు కేవలం ఐదు రోజుల్లోనే ఇన్వెస్ట్ చేసిన ప్రతీ రూపాయికి మరో రూపాయి పొందారని.. ఈ సినిమా ఖచ్చితంగా నిర్మాత అనిల్ సుంకరకు భారీ లాభాలు తెచ్చిపెట్టిందన్నారు. తనపై నమ్మకం ఉంచి ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా చేసిన హీరో మహేష్ బాబును చూసి గర్వపడుతున్నానని… ఏ బిగ్ హగ్ ఫర్ మహేష్ అంటూ థాంక్స్ చెప్పారు.


Next Story