- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, సినిమా : హాలీవుడ్ నటి ఏంజలినా జోలీ తాజాగా ఇన్స్టాగ్రామ్లో జాయిన్ అయింది. అఫ్ఘానిస్తాన్ ప్రజలు సోషల్ మీడియాలో తమను తాము స్వేచ్ఛగా వ్యక్తీకరించుకునే సామర్థ్యాన్ని కోల్పోతున్నారని.. ప్రాథమిక హక్కుల కోసం పోరాడుతున్న వారికి మద్దతు ఇచ్చేందుకే ఇన్స్టాలో చేరినట్లు తెలిపింది. ఈ క్రమంలోనే అఫ్ఘానిస్తాన్కు చెందిన యంగ్ టీనేజ్ గర్ల్ ఉత్తరాన్ని షేర్ చేసిన ఏంజలినా జోలి.. అఫ్ఘాన్ వాయిస్ వినిపించేందుకు ముందుకు రావాలని కోరింది. ‘నేను 9/11 కి రెండు వారాల ముందు అఫ్గానిస్తాన్ సరిహద్దులో ఉన్నాను. అక్కడ తాలిబాన్ నుండి పారిపోయిన అఫ్గాన్ శరణార్థులను కలిశాను. ఇది ఇరవై సంవత్సరాల క్రితంనుంచి తమ దేశాన్ని పట్టి పీడిస్తున్న భయం. మళ్లీ అప్ఘాన్లను స్థానభ్రంశం చేయడం బాధాకరం. దశాబ్దాలుగా ఆఫ్ఘన్ శరణార్థులు ప్రపంచంలోని అత్యంత సమర్థులైన వ్యక్తుల్లో కొందరు. వారిని భారంగా చూడటం బాధగా ఉంది’ అని టీనేజ్ గర్ల్ రాసిన లెటర్ను పంచుకుంది.