క్షమాపణలు చెప్పిన షారుక్.. ఇదే ముగింపు కాదన్న రస్సెల్

by  |
క్షమాపణలు చెప్పిన షారుక్.. ఇదే ముగింపు కాదన్న రస్సెల్
X

దిశ, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 14 సీజన్‌లో భాగంగా నిన్న చెన్నై వేదికగా ముంబై Vs కోల్‌కత్తా మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో ముంబై 10 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ నేపథ్యంలో నైట్ రైడర్స్.. జట్టు సహ యజమాని షారుక్‌ ఖాన్‌ క్షమాపణలు కోరుతూ ట్వీట్‌ చేశాడు. తమ జట్టు ప్రదర్శన నిరాశపరిచిందని, కనీస పోరాటం చేయలేదని, అభిమానులకు క్షమాపణ చెప్పాడు షారుక్.+

ఈ నేపథ్యంలో ‘ఆ ట్వీటుకు కేకేఆర్ ఆల్‌రౌండర్ ఆండ్రూ రస్సెల్ ఆసక్తికర రిప్లై ఇచ్చాడు. ఏదేమైనప్పటికీ క్రికెట్‌ ఇలాగే ఉంటుంది. ఆట ముగిసే వరకు ఎవరు గెలుస్తారో చెప్పలేం. మేం నాణ్యమైన క్రికెట్‌ ఆడాం. కుర్రాళ్ల పట్ల గర్వంగా ఉన్నా. మాకు ఆత్మవిశ్వాసం ఉంది. అపజయానికి నిరాశ చెందాం. కానీ ఇదే ముగింపు కాదు కదా. జట్టులో మార్పులు చేసుకొని మరింత మెరుగవుతాం’ అని రసెల్‌ అన్నాడు.


Next Story

Most Viewed