మనకు రాఫెల్ యుద్ధ విమానాలు అవసరమా..? ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ సంచలన కామెంట్స్

by  |
మనకు రాఫెల్ యుద్ధ విమానాలు అవసరమా..? ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ సంచలన కామెంట్స్
X

దిశ, ఆందోల్ : దేశ రక్షణ కోసం కొనుగోలు చేసిన రాఫెల్ యుద్ధ విమానాలపై ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రూ.లక్ష కోట్లకు పైగా ఖర్చు పెట్టి యుద్ధ విమానాలను కొంటున్నారు. అవి మనకు అవసరమా? అంటూ చేసిన వాఖ్యలు సంచలనంగా మారాయి. శుక్రవారం జోగిపేటలో నిర్వహించిన రైతు నిరసన కార్యక్రమంలో ఆయన ఈ వాఖ్యలు చేశారు. రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా, ప్రజలను తప్పుదోవ పట్టించే యత్నం బీజేపీ చేస్తుందన్నారు.

టీఆర్ఎస్ పార్టీలో కుటుంబ పాలన అంటూ విమర్శలు చేస్తున్నారని, బీజేపీలో 45 మంది రాజకీయ నాయకుల వారసులు కీలక పదవుల్లో ఉన్నారని, వీరిది కుటుంబ పాలన కదా అని ఆయన ప్రశ్నించారు. ప్రజా సమస్యలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేయడానికే, కేసీఆర్ మందు తాగుతడు, బండి సంజయ్ తాగడా..? అంటూ ఎద్దేవా చేశారు. నాకో మిత్రుడు చెప్పిండు బండి సంజయ్ ఎస్ఆర్ నగర్‌లో ఓ ఇంటికి వెళ్తాడని, కరీంనగర్‌కు వెళ్తే తోటకు రమ్మంటాడని చెప్పాడని, ఇలాంటివి మనం కూడా మాట్లాడగలుగుతామన్నారు. టైం పాస్ చేయడానికి, ప్రజలను తప్పుదోవ పట్టించడానికి బండి సంజయ్ మాటలను తిప్పికొట్టాలన్నారు.

సోషల్ మీడియాలో వైరల్..

దేశ రక్షణ కోసం కొనుగోలు చేసిన రాఫెల్ యుద్ధ విమానాలు మనకు అవసరమా? అని ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దేశ రక్షణ వ్యవస్థను, సైనికులను అవమానపరిచే విధంగా మాట్లాడారంటూ ఆయనకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్టులు పెడుతూ మండిపడుతున్నారు.

Next Story

Most Viewed