గుంటూరుకు వైఎస్ జగన్.. ఉత్కంఠ రేపుతున్న పర్యటన

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-02-03 15:14:00  IST  )

వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి బుధవారం గుంటూరులో పర్యటించనున్నారు...

గుంటూరుకు వైఎస్ జగన్.. ఉత్కంఠ రేపుతున్న పర్యటన
X

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి(Ys Jagan Mohan) బుధవారం గుంటూరులో పర్యటించనున్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు(Ambati ) కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు. ఆయన ఇంటిని పరిశీలించనున్నారు. తదుపరి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను కలుసుకుని వారిని పరామర్శించనున్నారు. అలాగే శుక్రవారం ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్‌ సహా ఆయన కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు. కాగా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌పై అసభ్య వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో టీడీపీ నేతలు జోగి రమేశ్, అంబటి ఇంటిపై దాడి చేశారు. దీంతో వాళ్ల కుటుంబాలను మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పరామర్శించనున్నారు.

Read Also.. మత్స్య సంపద, తీరప్రాంత జీవనోపాధికి కృషి.. కేంద్ర మంత్రితో ఏపీ అసెంబ్లీ స్పీకర్ భేటీ

Next Story