Hyderabad సీబీఐ కోర్టుకు వివేకా హత్య కేసు నిందితులు

by Disha Web Desk 16 |
Hyderabad సీబీఐ కోర్టుకు వివేకా హత్య కేసు నిందితులు
X

దిశ, కడప : మాజీ మంత్రి వై.ఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు నిందితులను భారీ పోలీసు బందోబస్తు మధ్య హైదరాబాద్ సీబీఐ కోర్టుకు తరలించారు. కడప సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న ఏ2 సునీల్ కుమార్ యాదవ్, ఏ3 గజ్జల ఉమాశంకర్ రెడ్డి, ఏ5 దేవిరెడ్డి శివశంకర్ రెడ్డితో పాటు బెయిల్‌పై ఉన్న ఏ1 గంగిరెడ్డి, ఏ4 అప్రూవర్‌గా మారిన డ్రైవర్ దస్తగిరి‌ని వేరు వేరుగా హైదరాబాద్‌కు తీసుకొచ్చారు.వీరిని శుక్రవారం ఉదయం హైదరాబాద్ సీబీఐ కోర్టులో విచారించనున్నారు.

కాగా మాజీ మంత్రి వై.ఎస్ వివేకానందారెడ్డి 2019 మార్చి 15న తన స్వగృహంలోనే దారుణ హత్యకు గురైన విషయం విధితమే. విచారణ నత్తనడకన సాగుతుండడంతో వివేకా కుమార్తె సునీత అభ్యర్థన మేరకు హైదరాబాద్ సీబీఐ కోర్టుకు ఈ కేసును సుప్రీంకోర్టు బదిలీ చేసింది. దీంతో సీబీఐ అధికారులు కేసు విచారణను వేగవంతం చేశారు. ఇప్పటికే కడప ఎంపీ వై.ఎస్ అవినాష్ రెడ్డిని హైదరాబాద్‌ సీబీఐ కోర్టులో విచారించారు.

తాజాగా ఐదుగురు నిందితులను సీబీఐ విచారించనుంది. ఈ మేరకు వీరిని శుక్రవారం హైదరాబాద్ సీబీఐ కోర్టులో హాజరుపర్చాల్సి ఉంది. ఇందులో భాగంగానే ఐదుగురు నిందితులను హైదరాబాద్ తరలించారు. శుక్రవారం సీబీఐ కోర్టులో ప్రవేశ పెట్టనున్నారు. విచారణ అనంతరం నిందితులను హైదరాబాద్‌లోనే ఉంచి తదుపరి విచారణ జరుపుతారా?, లేక కడప సెంట్రల్ జైలుకు తరలిస్తారా అనేది చూడాల్సి ఉంది.

Also Read..

Cm Jagan సెల్ఫ్ ఆపరేషన్ షురూ...తొలుత అక్కడి నుంచే..!

Next Story

Most Viewed