మద్యం మత్తులో ఆకతాయి హల్ చల్..రెండు వాహనాలకు నిప్పు

by Disha Web Desk 18 |
మద్యం మత్తులో ఆకతాయి హల్ చల్..రెండు వాహనాలకు నిప్పు
X

దిశ,కడప:నగరంలో మద్యం మత్తులో రెండు మోటారు సైకిళ్లకు నిప్పు పెట్టిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు వన్ టౌన్ సి.ఐ భాస్కర్ రెడ్డి తెలిపారు.గురువారం పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కడప నగరంలోని నాగరాజు పేట, శ్రీహరిరావు వీధులలో తెల్లవారుజామున 2.30 నుంచి 3 గంటల మధ్యలో గుర్తు తెలియని వ్యక్తి నాగరాజు పేట లో నారపనేని చంద్రశేఖర్ ఇంటి ముందు పార్క్ చేసి వున్న హోండా డియో మోటార్ సైకిల్ తో పాటు మరికొంత దూరంలో ఉన్న అడ్వకేట్ షేక్ నజీర్ బాష కు చెందిన హోండా యాక్టివా మోటార్ సైకిల్ నిప్పు పెట్టడంతో పాక్షికంగా దగ్దమయ్యాయి అని తెలిపారు. ఈ రెండు సంఘటనలకు సంబంధించిన బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు.

మోటారు సైకిళ్లు దగ్ధమైన ప్రాంతంలో ని కమ్యూనిటి పోలీసు ఆఫీసరు షేక్ అబీద్ సహకారంతో వాహనాలకు నిప్పు పెట్టిన వ్యక్తిని సీసీ టీవీ ఫుటేజ్ ద్వారా గుర్తించి, నేరాలకు పాల్పడిన నబీ కోటకు చెందిన బేగ్ మహబూబ్ బాషా (38) ను అరెస్టు చేశామన్నారు.బేగ్ మహబూబ్ బాష నగరంలో అక్కడక్కడ హోటల్లో పని చేస్తూ, తాగుడుకు బానిసై, పంచర్లు వేసే సొల్యూషన్ ను పీల్చుతూ, మత్తుకు బానిస అయ్యారన్నారు. మత్తులో ఈ ఘటనకు పాల్పడ్డారని చెప్పారు. అతను గతంలో ఇలాగే కడప తాలూకా పోలీస్ స్టేషన్ వద్ద నిద్రపోతున్న బాలుడి తల పగలకొట్టిన కేసులో 6 సంవత్సరాలు శిక్ష కూడా అనుభవించారన్నారు. పంచర్లు వేసే సొల్యూషన్ పీల్చుతూ మత్తుకు బానిసై గంజాయి పీలుస్తూ తారసపడిన పోలీసులకు సమాచారం అందించాలని సి.ఐ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.


Read More..

BREAKING: విశాఖ తీరంలో 25 వేల కేజీల డ్రగ్స్ స్వాధీనం.. ఇంటర్‌పోల్ సమాచారంతో సీబీఐ ఆపరేషన్


Next Story

Most Viewed