ఐసీయూలో పందికొక్కులు.. హడలిపోయిన పేషెంట్లు

by Vemula.Srinu Prasad |

అన్నమయ్య జిల్లా మదనపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో ఎలుకల సంచారం చర్చనీయాంశంగా మారింది. ఆపరేషన్ థియేటర్ పక్కనే ఉన్న ఐసీయూ వార్డులో పంది కొక్కులు సంచారం చేశాయి...

ఐసీయూలో పందికొక్కులు.. హడలిపోయిన పేషెంట్లు
X

దిశ, వెబ్ డెస్క్: అన్నమయ్య జిల్లా (Annamayya District)మదనపల్లి ప్రభుత్వ ఆస్పత్రి(Madanapalli Government Hospital)లో ఎలుకల సంచారం చర్చనీయాంశంగా మారింది. ఆపరేషన్ థియేటర్ పక్కనే ఉన్న ఐసీయూ వార్డు(Icu Ward)లో పంది కొక్కులు(Bandicoots) సంచారం చేశాయి. దీంతో పేషెంట్లు, అటెండర్లు హడలిపోయారు. ఆస్పత్రి మెయింటెనెన్స్ సరిగా లేదని, సౌకర్యాలు మెరుగుపర్చాలని డిమాండ్ చేశారు. రోగులను కరిస్తే పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఆస్పత్రిలో ఎటు చూసినా పందికొక్కులు, ఎలుకలు సంచరిస్తున్నాయని, వెంటనే జిల్లా యంత్రాంగం స్పందించాలని కోరుతున్నారు.

Next Story