- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
పోసాని డ్రామాలు మామూలుగా లేవ్.. పోలీసుల షాకింగ్ స్టేట్ మెంట్

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ మాజీ నేత, నటుడు పోసానిపై అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు రూరల్ సీఐ వెంకటేశ్వర్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. పోసాని మురళి ఈ ఉదయం నుంచి చాతి నొప్పి అని డ్రామా ఆడారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పోసాని అడిగిన అన్ని పరీక్షలు చేయించామని చెప్పారు. పోసానికి ఎలాంటి అనారోగ్యం లేదని తేలిందని తెలిపారు. ప్రస్తుతం పోసానిని రాజంపేట సబ్ జైలుకు తరలిస్తున్నామని రైల్వే కోడూరు రూరల్ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.
కాగా శనివారం ఉదయం పోసాని కృష్ణమురళి జైలులో అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను రాజంపేట ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్ల సూచనల మేరకు కడప రిమ్స్కు పోసానిని తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే పోసాని ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని.. ఈ ఉదయం నుంచి నాటకాలాడారని రైల్వే కోడూరు రూరల్ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. కడుపులో నొప్పి అని చెప్పడంతో రాజంపేట, కడపలో వైద్య పరీక్షలకు తరలించామని వెంకటేశ్వర్లు తెలిపారు.