- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Kadapa: దాతృత్వం చాటుకున్న ఎమ్మెల్యే... పేద కుటుంబానికి రూ.2 లక్షల ఆర్థిక సాయం
దిశ, కడప: దువ్వూరు శివాలయంలో పూజారిగా పని చేస్తున్న కె సుబ్బ నరసయ్య కుటుంబ సభ్యులకు మైదుకూరు శాసనసభ్యులు శెట్టిపల్లె రఘు రామిరెడ్డి రెండు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేసి దాతృత్వం చాటుకున్నారు. మంగళవారం ఆయన గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమంలో భాగంగా ఇంటింటా తిరిగారు. పేద బ్రాహ్మణ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రఘు రామిరెడ్డి వారికి ఆర్థిక సాయం చేయడం జరిగింది.
పూజారి సుబ్బ నరసయ్య, ఆయన కుమారుడు శివకుమార్ ఇరువురు రెండు సంవత్సరాల క్రితం కరోనా బారిన పడి మృత్యువాత పడ్డారు. ఆయన కూతురు జ్యోతి, భార్య శశికళ తలదాచుకోవడానికి నివాసం లేదని మైదుకూరు శాసనసభ్యుడు శెట్టిపల్లె రఘురామిరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే దివంగత పూజారి భార్య, కూతురికి 50 వేల రూపాయలు నగదును అందించడం జరిగింది. అలాగే ఇంటికి కావాల్సిన సామాగ్రిని అందిస్తానని వారికి హామీ ఇచ్చారు. అందులో భాగంగా ప్రస్తుతం దువ్వూరుకు వచ్చిన ఎమ్మెల్యే రఘు రామిరెడ్డి మండల నాయకులందరూ కలిసి 1,50,000 రూపాయలు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఆయన చేతుల మీదుగా అందజేయడం జరిగింది.