Kadapa: జగన్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బీభత్సం.. 15 మందికి గాయాలు

by Disha Web Desk 16 |
Kadapa: జగన్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బీభత్సం.. 15 మందికి గాయాలు
X

దిశ, కడప: వైయస్సార్ జిల్లా దువ్వూరు మండలం గుడిపాడు వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు పొలాల్లోకి దూసుకెళ్ళింది. ఈ ఘటనలో 15 మంది గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న జగన్ ప్రైవేట్ ట్రావెల్ బస్సు అదుపు తప్పింది. వేగంగాపొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ సంఘటనలో బస్సు డోర్లు ఓపెన్ కాకపోవడంతో ప్రయాణికులు బస్సులోనే ఉండి పోయారు. సమాచారం తెలుసుకున్న గుడిపాడు గ్రామ ప్రజలు బస్సులోని ప్రయాణికులను సురక్షితంగా బయటకు దించారు. బస్సు నుజ్జు నుజ్జు అయింది. మహిళకు కాలు విరిగింది. ముగ్గురికి కన్ను వద్ద గాయాలయ్యాయి. మరికొంత మందికి చిన్నపాటి గాయాలు కావడంతో వీరందరిని దువ్వూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story