Kadapa: అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్.. వజ్రాలు స్వాధీనం

by Disha Web Desk 16 |
Kadapa: అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్.. వజ్రాలు స్వాధీనం
X

దిశ,కడప: గోవాకు చెందిన అంతర్రాష్ట్ర దొంగ ఇస్మాయిల్ షాహిద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రూ. 53 లక్షల విలువైన మూడు చిన్న వజ్రాలు, విలువైన యెల్లో సఫైర్ వజ్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. 2020 సంవత్సరంలో కడప అల్మాస్ పేటకు చెందిన ఖాదర్ బాషా‌ను వజ్రాలు అమ్మిస్తామని చెప్పి లాడ్జిలో బంధించి కొందరు దుండగులు దోచుకెళ్లడం జరిగింది. గతంలో ఇదే కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా మరో వ్యక్తిని అరెస్టు చేశారు. కేసు ఛేదించి నిందితులు దోచుకున్న వజ్రాలను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్.పి కే.కే.ఎన్ అన్బురాజన్ తెలిపారు.

Next Story

Most Viewed