టీటీడీ అధ్వర్యంలో పవిత్రోత్సవాలు.. ఘనంగా అంకురార్పణ

by Vemula.Srinu Prasad |

వాల్మీకిపురం పట్టాభిరామ స్వామి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలకు సర్వం సిద్ధమైంది...

టీటీడీ అధ్వర్యంలో పవిత్రోత్సవాలు.. ఘనంగా అంకురార్పణ
X

దిశ, వెబ్ డెస్క్: రేపటి నుంచి అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం పట్టాభిరామ స్వామి ఆలయం(Valmikipuram Pattabhirama Swamy Temple)లో వార్షిక పవిత్రోత్సవాలు(Annual celebrations) వైభంగా జరగనున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానముల(Tirumala Tirupati Temples) ఆధ్వర్యంలో చేపట్టనున్న ఈ ఉత్సవాలకు శుక్రవారం అంకురార్పణ చేపట్టారు. ఆదివారం పవిత్ర ప్రతిష్ఠ, స్నపన తిరుమంజనం, సోమవారం పవిత్ర సమర్పణ, మంగళవారం మహా పూర్ణాహుతి, చక్రస్నానం నిర్వహించనున్నారు. అనంతరం తిరుచ్చి వీధి ఉత్సవం చేపట్టనున్నారు. ఈ పవిత్రోత్సవాల్లో పాల్గొనే భక్తులు ఒక టిక్కెట్టుకు రూ.300 చెల్లించాల్సి ఉంటుందని, ఇద్దరికి అనుమతి జారీ చేయనున్నారు.

Next Story