- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Cm Jagan: చెడిపోయిన వ్యవస్థతో యుద్ధం చేస్తున్నాం
వైఎస్సార్ఆర్ బస్ టెర్మినల్ను పులివెందులలో సీఎం జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పులివెందులలో వేగంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. ...

దిశ, వెబ్ డెస్క్: వైఎస్సార్ఆర్ బస్ టెర్మినల్ను పులివెందులలో సీఎం జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పులివెందులలో వేగంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. చెడిపోయిన వ్యవస్థతో తాము యుద్ధం చేస్తున్నామని జగన్ వ్యాఖ్యానించారు. ఎంత అభివృద్ధి చేసినా దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. గ్లాసులో నీళ్లు ఉన్నా నీళ్లే లేవని చంద్రబాబు ప్రచారం చేస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని చెప్పారు. గత పాలన, ఇప్పుటి పాలనపై పులివెందుల నుంచి ఇచ్చాపురం వరకు ప్రజలు ఒకసారి ఆలోచించాలని కోరారు. గత పాలకులు కూడా అప్పులు చేశారని గుర్తు చేశారు. 2019లో ముఖ్యమంత్రి మారడంతో అందరి తలరాతలు మారాయని సీఎం జగన్ తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడా లంచాలు లేవని సీఎం జగన్ స్పష్టం చేశారు.






