- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చెన్నైలో వైఎస్ జగన్ సందడి.. ఒకే వేదికపై రాజకీయ, సినీ దిగ్గజాల భేటీ
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెన్నై పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.

దిశ, డైనమిక్ బ్యూరో: వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెన్నై పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. జగన్ సోదరుడు వైఎస్ సునీల్ రెడ్డి కుమారుడి వివాహ వేడుకకు హాజరైన ఆయన, అక్కడ తమిళనాడు రాజకీయ, సినీ ప్రముఖులతో ఆత్మీయంగా గడిపారు. ఈ వేడుకలో తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత, నటుడు దళపతి విజయ్తో జగన్ ముచ్చటించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
రాజకీయ సమీకరణాలపై ఆసక్తికర చర్చ..
కొత్తగా రాజకీయ పార్టీ స్థాపించి తమిళనాట సంచలనం సృష్టిస్తున్న టీవీకే అధినేత విజయ్, వైఎస్ జగన్ పక్కపక్కనే కూర్చుని మాట్లాడుకోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది. ఇద్దరు అగ్ర నేతలు రాజకీయ పరిణామాల గురించి చర్చించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అభిమానులు వీరిద్దరినీ చూసి "జన నాయకుడితో జన నాయగన్" (ప్రజల నాయకుడితో ప్రజల హీరో) అంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు.
హాజరైన ప్రముఖులు..
కేవలం విజయ్ మాత్రమే కాకుండా, ఈ వివాహ వేడుకలో మరికొందరు ప్రముఖులు కూడా మెరిశారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కూడా ఈ వివాహానికి విచ్చేసి, వైఎస్ జగన్తో కొద్దిసేపు ముచ్చటించారు. కోలీవుడ్ హీరోలు సూర్య, కార్తీ కూడా ఈ వేడుకలో పాల్గొని జగన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. జగన్తో వారు చిరునవ్వుతో మాట్లాడుతున్న వీడియోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. చైన్నై పర్యటనలో ఉన్న జగన్ మోహన్ రెడ్డిని చూసేందుకు వైసీపీ కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. ఇంజంబాక్కంలోని నివాసం వద్ద ఆయనకు ఘనస్వాగతం పలికారు. పెళ్లి వేడుకలో సినీ, రాజకీయ రంగాల ప్రముఖులు ఒకే చోట కనిపించడంతో ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా సాగింది.






