మురళీనాయక్‌ త్యాగాన్ని మరువలేం:వైఎస్ జగన్

by Jakkula Mamatha |
మురళీనాయక్‌ త్యాగాన్ని మరువలేం:వైఎస్ జగన్
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh)లోని శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం కళ్ళి తండా గ్రామానికి చెందిన జవాన్ మురళీనాయక్‌ జమ్ముకాశ్మీర్‌లో వీరమరణం పొందారు. జమ్మూ కాశ్మీర్)Jammu Kashmir) లో పాకిస్థాన్ సైన్యం జరిపిన బాంబు దాడిలో ఆయన అమరుడయ్యారు. ఈ క్రమంలో మురళీనాయక్‌ వీరమరణం పై మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ(YSRCP) అధినేత వైఎస్‌ జగన్‌(YS Jagan) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశభద్రతలో తన ప్రాణాలను ఫణంగా పెట్టి వీరమరణం పొందిన మురళీనాయక్‌(Murali nayak) త్యాగాన్ని మరువలేమని అన్నారు. ఈ క్రమంలో మురళీనాయక్‌ కుటంబీకులకు వైఎస్ జగన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.



Next Story

Most Viewed