Liquor Case: వైపీసీ ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్

by Gantepaka Srikanth |   (  Updated:2025-07-20 11:17:50  IST  )

ఆంధ్రప్రదేశ్‌లో లిక్కర్ కుంభకోణం కేసు(AP Liquor Case)లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.

Liquor Case: వైపీసీ ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో లిక్కర్ కుంభకోణం కేసు(AP Liquor Case)లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అరెస్ట్ అయిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి(MP Mithun Reddy)కి ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. కాసేపట్లో భారీ బందోబస్తు నడుమ మిథున్ రెడ్డిన రాజమండ్రిలోని సెంట్రల్ జైలుకు తరలించనున్నారు. కాగా, ఈ కేసులో ఏ4గా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని శనివారం సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. సిట్ విచారణకు హాజరైన ఆయన్ను.. సుమారు 6 గంటలకు విచారించి.. ఆ తర్వాత అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ కోర్టులో ప్రవేశపెట్టగా, కోర్టు రిమాండ్ విధించింది. కాగా, మిథున్ రెడ్డికి చెందిన సంస్థలకు లిక్కర్ ముడుపులు వెళ్లినట్లు సిట్ గుర్తించింది. మరోవైపు ఇప్పటికే మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు, సుప్రీంకోర్టు కొట్టేశాయి. ఈ కేసులో ఇప్పటివరకు 12మంది అరెస్ట్ అయ్యారు.

Next Story