- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Home > ఆంధ్రప్రదేశ్ > 2024 ఎన్నికల్లో వైసీపీకి 25 సీట్లు కూడా రావు : పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు
2024 ఎన్నికల్లో వైసీపీకి 25 సీట్లు కూడా రావు : పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు
by Disha Web Desk 21 |
X
దిశ, డైనమిక్ బ్యూరో : 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కనీసం 25 సీట్లు కూడా రావని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. వైసీపీ ప్రభుత్వంపై అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని మండిపడ్డారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయా వైసీపీని ఎప్పుడు గద్దె దించుదామా అనే ఆలోచనలో ప్రజలు ఉన్నారని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. పాలకొల్లులో బుధవారం నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలవుతుందని ముందే గ్రహించిందని అందువల్లే చంద్రబాబుపై కుట్ర చేసి అన్యాయంగా జైల్లో పెట్టారని ఆరోపించారు. చంద్రబాబు అక్రమ అరెస్టుపై ప్రజల్లో రోజురోజుకీ ఆవేశం, ఆగ్రహాలు పెరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. ఈ అగ్రహావేశాలు వచ్చే ఎన్నికల్లో ఓటు రూపంలో వైసీపీపై చూపిస్తారని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు హెచ్చరించారు.
Next Story