ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఖాళీ అవుతోన్న వైసీపీ.. ఎన్నికల వేళ అధికార పార్టీకి వరుస షాక్‌లు

by Disha Web Desk 1 |
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఖాళీ అవుతోన్న వైసీపీ.. ఎన్నికల వేళ అధికార పార్టీకి వరుస షాక్‌లు
X

దిశ, వెబ్‌డెస్క్: ఉమ్మడి నెల్లూరు జిల్లాల్లో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఇటీవలే జిల్లాలోని వైసీపీ కీలక నేతలంతా టీడీపీలో చేరడంతో రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారింది. ఇప్పటికే సీఎం జగన్ తీరు నచ్చక ముగ్గురు ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి టీడీపీలో చేరబోతున్నారు. ఈ క్రమంలోనే వైసీపీకి మరొకొందరు నాయకులు రాజీనామాకు సిద్ధమయ్యారు. రూరల్ కోడూరులో వైసీపీ ముఖ్య నేత కమలాకర్ రెడ్డి వైసీపీ రాజీనామా చేశారు. అదేవిధంగా నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్, మరికొందరు రాజీనామాకు సిద్ధమవుతున్నారు. ఇక ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి కూడా సైకిల్ ఎక్కనున్నారు. అయితే, ఈ నెల 2న జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన ఉండటంతో ఆయన సమక్షంలో వారంతా టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారని తెలుస్తోంది.



Next Story

Most Viewed

    null