పులివెందుల ఎన్నికల వేళ బిగ్ షాక్.. వైసీపీ అభ్యర్థనకు హైకోర్టు నిరాకరణ

by Vemula.Srinu Prasad |

పులివెందుల ఎన్నికల వేళ వైసీపీకి బిగ్ షాక్ తగిలింది...

పులివెందుల ఎన్నికల వేళ బిగ్ షాక్.. వైసీపీ అభ్యర్థనకు హైకోర్టు నిరాకరణ
X

దిశ, వెబ్ డెస్క్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(Ysr Cogress Party) నాయకులకు హైకోర్టు(High Court)లో బిగ్ షాక్ తగిలింది. పులివెందుల ఎన్నికల్లో(Pulivendual Elections) బూత్ లను యథావిథిగా కొనసాగించాలని దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టులో విచారణ జరిగింది. అయితే ఆ అభ్యర్థనకు నిరాకరించింది. పోలింగ్ బూత్ మార్పు విషయంలో తాము జోక్యం చేసుకోలేమని తేల్చి తెచ్చింది. దీంతో ప్రభుత్వం మార్పు చేసిన 6 బూత్‌ల్లోనే పోలింగ్ కొనసాగనుంది. హైకోర్టు తీర్పుపై గంపెడు ఆశలు పెట్టుకున్న వైసీపీ(Ycp) నేతలకు ఎదురుదెబ్బ తగిలింది.

కాగా పులివెందుల జడ్పీటీసీ ఎన్నికలు(Pulivendula ZPTC elections) మంగళవారం జరగనున్నాయి. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకూ పోలింగ్ జరగనుంది. ఈ మేరకు ఎన్నికల అధికారులు, పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే పులివెందుల మండలంలో ఆరు ప్రాంతాలు సమస్యాత్మకంగా ఉండటంతో ఆయా పోలింగ్ బూత్‌లను మార్పు చేశారు. దీంతో ఈ మార్పుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హైకోర్టులో సవాల్ చేసింది.

Next Story