స్పీకర్‌కు వైసీపీ రెబల్ ఎమ్మెల్యే ఆనం లేఖ

by Disha Web Desk 2 |
స్పీకర్‌కు వైసీపీ రెబల్ ఎమ్మెల్యే ఆనం లేఖ
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాంకు వైసీపీ రెబల్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి లేఖ రాశారు. తనపై ఫిర్యాదుకు సంబంధించిన వీడియోలు, సోషల్ మీడియా పోస్టుల కాపీలు ఇవ్వాలని స్పీకర్‌ను సోమవారం కోరారు. ఆనం బాటలోనే మిగిలిన రెబల్ ఎమ్మెల్యేలు కూడా చేరారు. తమకు కూడా మరింత సమయం కావాలని స్పీకర్‌ను రిక్వెస్ట్ చేశారు.

చాలా క్లియర్‌గా ఇవాళ విచారణకు హాజరు కాలేమని ఎమ్మెల్యేలంతా స్పష్టం చేశారు. కాగా, ఇటీవల వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ మరోసారి నోటీసులు పంపించారు. 19న విచారణకు హాజరు కావాలని ఈ మేరకు నోటీసులు జారీ చేశారు. టీడీపీ, వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు నిన్న శుక్రవారం విచారణకు రావాలని స్పీకర్ ఆదేశించారు. కానీ ఇరు పక్షాల ఎమ్మెల్యేలు విచారణకు హాజరుకాలేదు. నోటీసులపై ఇవాళ స్పందించి మరికొంత సమయం కావాలని కోరారు.



Next Story

Most Viewed