జగన్ జైలు నుంచి బయటకొచ్చి పదేళ్లు.. క్రేజీగా విష్ చేసిన సొంత పార్టీ ఎంపీ! (వీడియో)

by Disha Web Desk 2 |
జగన్ జైలు నుంచి బయటకొచ్చి పదేళ్లు.. క్రేజీగా విష్ చేసిన సొంత పార్టీ ఎంపీ! (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి జైలు నుంచి బయటకొచ్చి నేటికి సరిగ్గా పదేళ్లు పూర్తయిన సందర్భంగా టీడీపీ శ్రేణులు వినూత్నంగా శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేశారు. జైలు మోహన్ రెడ్డికి బెయిల్ డే పదో వార్షికోత్సవ శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారు. 42 వేల కోట్ల ప్రజాధ‌నం దోచేసి, సీబీఐ-ఈడీ పెట్టిన 38 కేసుల్లో ఏ1 అయినా ప‌దేళ్లుగా బెయిలుపై ఉన్న ఆర్థిక ఉగ్రవాది అంటూ మండిపడ్డారు నారా లోకేష్. జైలు మోహ‌న్‌ ప్రజాస్వామ్య వ్యవ‌స్థల్ని ధ్వంసం చేస్తూ, రాజ్యాంగాన్ని కాల‌రాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదిలా ఉండగా.. జగన్‌కు షాకిచ్చేలా వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు సైతం వినూత్న రీతిలో శుభాకాంక్షలు చెప్పారు. పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి జగన్‌కు విషెస్ చెప్పారు. ‘ఇది మన పార్టీకి, కార్యకర్తలకు ముఖ్యమైన పండుగ’ అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు. దీనికి టీడీపీ శ్రేణులు, వైసీపీ కార్యకర్తలు రకరకాల రీతిలో స్పందిస్తున్నారు.

Next Story