వైసీపీకి మరో బిగ్ షాక్.. జనసేనలో చేరేందుకు సిద్ధమైన MLA

by Disha Web Desk 2 |
వైసీపీకి మరో బిగ్ షాక్.. జనసేనలో చేరేందుకు సిద్ధమైన MLA
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికలు సమీపిస్తోన్న వేళ అధికార వైసీపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు టీడీపీలోకి, జనసేనలోకి వెళ్లారు. తాజాగా.. మరో ఎమ్మెల్యే వైసీపీకి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు జనసేనలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌తో భేటీ అయ్యారు. పవన్ కల్యాణ్ సానుకూలంగా స్పందించడంతో చేరిక ఖరారు చేసుకున్నారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ ఇచ్చేందుకు వైసీపీ నిరాకరించడంతో తన సత్తా ఏంటో వైసీపీకి చూపించాలని ఫిక్స్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే వైసీపీ షాక్ ఇవ్వాలంటే జనసేనలో చేరడమే సరైన నిర్ణయమని భావించి మంతనాలు పూర్తి చేశారు. రెండ్రోజుల్లో ఆయన జనసేనలో చేరుతారని సమాచారం.

Next Story

Most Viewed