చిరంజీవి కేంద్రమంత్రి పదవిపై YCP ఎమ్మెల్యే సెన్సేషనల్ కామెంట్స్

by Disha Web Desk 19 |
చిరంజీవి కేంద్రమంత్రి పదవిపై YCP ఎమ్మెల్యే సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌‌పై భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌కి అమ్మి చిరంజీవి కేంద్రమంత్రి పదవి పొందారని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఎన్నికల వేళ పవన్ కల్యాణ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని.. ఆయన నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. పవన్ కల్యాణ్ అజ్ఞానంతో మాట్లాడుతున్నారని.. భీమవరం గురించి అసలు ఆయనకు ఏం తెలుసని ప్రశ్నించారు. గంటకో మాట మారుస్తారని విమర్శించారు.

ఏపీ రాజకీయాల్లో గందరగోళానికి కారణం జనసేన పార్టీ అని మండిపడ్డారు. 2019లో భీమవరంలో ప్రజలు పవన్ కల్యాణ్‌ను కాదని తనను గెలించారని గుర్తు చేశారు. కాగా, 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గాజువాకతో పాటు పవన్ కల్యాణ్ భీమవరంలో కూడా పోటీ చేసిన విషయం తెలిసిందే. భీమవరంలో వైసీపీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్ చేతిలో పవన్ కల్యాణ్ ఓటమి పాలయ్యారు. స్టార్ యాక్టర్ కమ్ జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌ను ఓడించడంతో అప్పట్లో గ్రంధి పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో మోర్మోగింది.



Next Story

Most Viewed