సభను అడ్డుకునేందుకే అసెంబ్లీకి వచ్చావా.. కోటంరెడ్డిపై మంత్రులు సీరియస్

by Disha Web Desk 2 |
సభను అడ్డుకునేందుకే అసెంబ్లీకి వచ్చావా.. కోటంరెడ్డిపై మంత్రులు సీరియస్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై మంత్రులు సీరియస్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, అధికార పార్టీలో తనకు జరిగిన అవమానాన్ని అసెంబ్లీలో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ప్రస్తావిస్తుండగా.. మంత్రులు అంబటి రాంబాబు, బుగ్గన రాజేంద్రనాథ్ మండిపడ్డారు. సభను అడ్డుకునేందుకే సమావేశానికి వచ్చావా? అని ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కోటంరెడ్డి నమ్మక ద్రోహి అని, టీడీపీ కోసమే ఆయన పనిచేస్తున్నారని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. వ్యక్తిగత అంశాలకు అసెంబ్లీలో చోటులేదని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. ప్రజా సమస్యలు ఏవైనా ఉంటే చెప్పాలని శ్రీధర్ రెడ్డికి సూచించారు.

Next Story