డీఎస్సీలో అక్రమాలు... అన్ని జిల్లాల్లోనూ నిరసనలు

by Vemula.Srinu Prasad |

మద్యం మత్తులో ఓ ఏఎస్ఐ రెచ్చిపోయారు. హోటల్ నిర్వాహకులతో గొడవకు దిగారు. దీంతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘటన తిరుపతి సత్యనారాయణపురంలో జరిగింది. ..

డీఎస్సీలో అక్రమాలు... అన్ని జిల్లాల్లోనూ నిరసనలు
X

దిశ, వెబ్ డెస్క్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(Ysr Congress Party) విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) వ్యాప్తంగా భారీ నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. డీఎస్సీ(DSC) నిర్వహణలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ఆ విభాగం నేతలు, కార్యకర్తలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని, డీఎస్సీ ప్రక్రియలో చోటుచేసుకున్న అవకతవకలపై తక్షణమే ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

అన్ని జిల్లాల కేంద్రాల్లోనూ..

మరోవైపు ఈ ఆందోళనల్లో భాగంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల కేంద్రాల్లోనూ వైసీపీ విద్యార్థి విభాగం ప్రతినిధులు నిరసనలు చేపట్టారు. కలెక్టరేట్లు, విద్యాశాఖ కార్యాలయాల ముట్టడికి యత్నించారు. దీంతో కొన్నిచోట్ల ఉద్రిక్తత చోటు చేసుకుంది. అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని, లేనిపక్షంలో తమ పోరాటం ఆగేది లేదని విద్యార్థి విభాగం నేతలు హెచ్చరించారు.

Next Story