‘రామ్మోహన్ నాయుడిని లోకేష్‌ ఎప్పటికీ ఎదగనివ్వడు’

by Disha Web Desk 2 |
‘రామ్మోహన్ నాయుడిని లోకేష్‌ ఎప్పటికీ ఎదగనివ్వడు’
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై వైసీపీ నేత కేశినేని నాని తీవ్ర ఆరోపణలు చేశారు. శుక్రవారం నాని ఓ మీడియా ప్రతినిధితో మాట్లాడుతూ.. నారా లోకేష్ పార్టీలో కొనసాగినన్ని రోజులు ఏ లీడర్‌నూ ఎదగనివ్వడు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎంపీ రామ్మోహన్‌ నాయుడి ఎదుగుదలను కూడా అడ్డుకుంటున్నాడని ఆరోపించారు.. రామ్మోహన్ ఎదుగుతుంటే లోకేష్ చూడలేకపోతున్నాడని చెప్పారు. రామ్మోహన్ నాయుడే కాదు.. కమ్మ కమ్యూనిటీలో స్ట్రాంగ్ లీడర్‌‌గా ఎవరైనా ఎదిగితే చంద్రబాబు, లోకేష్‌కు భయం మొదలవుతుందని విమర్శించారు. 2019లో పార్టీ ఓటమికి లోకేష్ తెలివిలేని ఎత్తుగడలే కారణమని ఎద్దేవా చేశారు.


పార్టీలో ఎవరికి ప్రజల్లో ఆదరణ పెరిగినా తండ్రి, కొడుకులు జీర్ణించుకోలేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనేకమంది ఈ కారణం చేతనే పార్టీని వీడారని అన్నారు. గతంలో సుజనా చౌదరి పార్టీని వీడేందుకు కూడా లోకేషే కారణమని సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడ అభివృద్ధిని కోరుకునే తప్పకుండా నాకు ఓటు వేస్తారని కేశినేని నాని అభిప్రాయపడ్డారు. అక్రమాలు చేసేవారికి అడ్డుగా ఉన్నానని తనను మొదటినుంచి వ్యతిరేకించారని అన్నారు. నేను పార్టీని వీడటానికి కూడా మెయిన్ రీజన్ లోకేషే అని కీలక వ్యాఖ్యలు చేశారు.



Next Story

Most Viewed