Breaking:వైసీపీ కీలక నేతకు బెయిల్

by Jakkula.Mamatha |

వైసీపీ కీలక నేతకు బెయిల్ మంజూరైంది.

Breaking:వైసీపీ కీలక నేతకు బెయిల్
X

దిశ,వెబ్‌డెస్క్:వైసీపీ కీలక నేతకు బెయిల్ మంజూరైంది. వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను ఓ దాడి కేసులో గత నెల(మే) 18న తుళ్లూరు పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌(Former MP Nandigam Suresh)కు బెయిల్ మంజూరైంది. గత కొన్ని రోజులుగా నందిగం సురేష్ గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. టీడీపీ(TDP) కార్యకర్త ఇసుకపల్లి రాజు పై దాడి కేసులో గుంటూరు జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దాడి ఘటన మే 17, 2025 న ఉద్దండరాయునిపాలెంలో మాజీ ఎంపీ నందిగం సురేష్ ఇంటి దగ్గర జరిగింది. ఈ దాడి ఘటన పై రాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Next Story