చంద్రబాబు ఏం చేసినా 7 స్థానాలు మావే: మంత్రి గుడివాడ అమర్నాథ్

by Disha Web Desk 19 |
చంద్రబాబు ఏం చేసినా 7 స్థానాలు మావే: మంత్రి గుడివాడ అమర్నాథ్
X

దిశ, వెబ్‌డెస్క్: మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 16 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీతో టచ్‌లో ఉన్నారనేది పూర్తి అవాస్తవమని.. ఎమ్మెల్సీ ఎన్నికల వేళ టీడీపీ మైండ్ గేమ్ ఆడుతోందని అన్నారు. అసలు టీడీపీతో టచ్‌లో ఉండాల్సి అవసరం తమ పార్టీ నేతలకు లేదని చెప్పారు. చంద్రబాబు ఏం చేసినా ప్రజా ప్రతినిధుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏడుకు ఏడు స్థానాలు వైసీపీ గెలుస్తోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ ప్రచారం చేస్తోన్నట్లుగా తమ పార్టీలో అసంతృప్తులు లేరని క్లారిటీ ఇచ్చారు.

ఇక, ఏపీలో ప్రజాప్రతినిధుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 120 మందికి పైగా వైసీపీ ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఖాళీ అయిన ఏడు స్థానాల్లో తామే గెలుస్తామని వైసీపీ నేతలు చెబుతుండగా.. టీడీపీ అభ్యర్థి విజయం సాధిస్తాడని ప్రతిపక్ష నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అనూహ్య విజయం సాధించడంతో.. ఈ ఎన్నికపై మరింత ఉత్కంఠ నెలకొంది.

Also Read...

వైసీపీని వెంటాడుతోన్న ఎమ్మెల్సీ టెన్షన్

Next Story

Most Viewed