వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలే టీడీపీని గెలిపిస్తాయి : టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు

by Disha Web Desk 1 |
వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలే టీడీపీని గెలిపిస్తాయి : టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు
X

దిశ, వెబ్‌డెస్క్ : రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని, అందుకు తోడు వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలే రాబోయే ఎన్నికల్లో టీడీపీని గెలిపించబోతున్నాయని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఇవాళ ఆయన చిలకలూరిపేటలో మీడియాతో మాట్లాడుతూ.. నెల రోజుల నుంచి అంగన్‌వాడీలు తమ డిమాండ్లను పరిష్కరించాలని సమ్మె చేస్తున్నా ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోకపోవడం దారణమని అన్నారు. అదేవిధంగా మున్సిపల్ కార్మికుల ఆందోళతో రాష్ట్రంలో పారిశుధ్యం అటకెక్కిందని ఎద్దేవా చేశారు. తన సొంత చెల్లి చీకొట్టి వేరే పార్టీలో చేరినా.. జగన్‌ను గుడ్డిగా నమ్మి తన వెంట నడిచిన నాయకులంతా ఒక్కొక్కరుగా పార్టీ నంచి వెళ్లిపోతున్నా ఎలా జగన్ మళ్లీ విజయం సాధిస్తారోనని ప్రత్తిపాటి పుల్లారావు కామెంట్ చేశారు.

Next Story

Most Viewed