వైసీపీ దసరా తాయిలాలు: బతికున్న కోడీ, మందుబాటిల్

by Disha Web Desk 21 |
వైసీపీ దసరా తాయిలాలు: బతికున్న కోడీ, మందుబాటిల్
X

దిశ, డైనమిక్ బ్యూరో : దసరా పండుగ అంటే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో అంతా కలిసి ఎంతో సంబరంగా జరుపుకుంటారు. ఇకపోతే రాజకీయ నాయకులు అయితే అత్యంత ఆప్తులతో కలిసి సహపంక్తి భోజనం ఏర్పాటు చేసి, కొత్తబట్టలు ఇచ్చి వారిని సంతృప్తి పరుస్తుంటారన్న సంగతి తెలిసిందే. అయితే విశాఖలో ఓ వైసీపీ నాయకుడు దసరా పండుగ సందర్భంగా కార్యకర్తలు, అభిమానులకు తాయిలాలు ఇచ్చారు. విశాఖపట్నం వైసీపీ మండల అధ్యక్షుడు దొడ్డి బాపు ఆనంద్ కార్యకర్తలకు కోడి, మందు బాటిల్ పంపిణీ చేశారు.31వ వార్డులో కిక్ ఇచ్చే కానుకల కోసం వైసీపీ కార్యకర్తలతోపాటు స్థానికులు సైతం క్యూ కట్టారు. స్థానిక ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ప్లెక్సీ పెట్టి మరీ తాయిలాలు పంపిణీ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వచ్చే ఏడాది ఏపీలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓటర్లను, కార్యకర్తలను ఆకట్టుకునేందుకు దొడ్డి బాపు ఆనంద్ ఈ తాయిలాలకు తెరలేపారని అంటున్నారు. దొడ్డి బాపు ఆనంద్ వెనుక ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ హస్తం ఉన్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎన్నికలు రానున్న నేపథ్యంలో వైసీపీ ముందుచూపుతో ఈ తాయిలాలు పంచిపెట్టినట్లు విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

Next Story

Most Viewed