దొంగ ఓట్లతోనే గెలిచా: ఎమ్మెల్యే రాపాక సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 19 |
దొంగ ఓట్లతోనే గెలిచా: ఎమ్మెల్యే రాపాక సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ రూ.10 కోట్లు ఆఫర్ చేసిందంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. గత ఎన్నికల్లో తాను దొంగ ఓట్లతోనే గెలిచానని.. తన సొంత గ్రామం చింతలమోరిలో తనకు భారీగా దొంగ ఓట్లు పడ్డాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ఇతర గ్రామాల నుండి వచ్చి కొందరు తనకు దొంగ ఓట్లు వేసేవారని అన్నారు. ఒక్కొక్కరు 10 దొంగ ఓట్లు వేయడం వల్లే గెలిచేవాడినని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. అప్పటి నుంచి నా గెలుపుకు కారణం దొంగ ఓట్లే అని వరప్రసాద్ షాకింగ్ కామెంట్స్ చేశారు.



Next Story

Most Viewed