ఎలమంచిలి జాతీయ రహదారిపై మహిళ హత్య

by Malleboina Mahesh |

అనకాపల్లి జిల్లా ఎలమంచిలి జాతీయ రహదారి ప్రక్కన మర్రిబంద వద్ద గుర్తు తెలియని మహిళ హత్యకు గురైనట్లు పోలీసులు కనుగొన్నారు.

ఎలమంచిలి జాతీయ రహదారిపై మహిళ హత్య
X

దిశ, అనకాపల్లి: అనకాపల్లి జిల్లా ఎలమంచిలి జాతీయ రహదారి ప్రక్కన మర్రిబంద వద్ద గుర్తు తెలియని మహిళ హత్యకు గురైనట్లు పోలీసులు కనుగొన్నారు. మహిళను హతమార్చి పెట్రోల్ పోసి తగలబెట్టినట్లు గా గుర్తించారు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి పోలీసులు, చేరుకున్నారు. ఘటన స్థలానికి క్లూస్ టీం చేరుకుంది. డీఎస్పీ పి శ్రీనివాసరావు, ఎస్పీ గౌతమి శాలి కేసుకు సంబంధించిన వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story