- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలో గాలివాన బీభత్సం.. మిర్చి, మామిడి రైతుల అష్టకష్టాలు
రాష్ట్రంలో పలు చోట్ల గాలి వాన బీభత్సం సృష్టించింది...

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో పలు చోట్ల గాలి వాన(wind rain) బీభత్సం సృష్టించింది. ఉదయం వరకూ వాతావరణం(Weather) ఒకలా.. మధ్యాహ్నం వరకూ మరోలా మారిపోయింది. ఒక్కసారిగా వాతావరణ చల్లబడి వడగళ్ల వర్షం(Hail rain) పడింది. దీంతో ప్రకాశం, బాపట్ల జిల్లాలో భారీ వర్షం పడింది. ప్రకాశం జిల్లా దర్శి, అద్దంకిలో భారీగా ఈదురుగాలులు వీచాయి. ఒంగోలు, పొదిలి, కొనకనమిట్లలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. దీంతో మిర్చి రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఒక్కసారిగా వర్షం విరుచుకుపడటంతో కల్లాల్లో ఉన్న మిర్చి తడిచిపోయింది. మిర్చిని కాపాడుకునేందుకు రైతులు నానా అవస్థలు పడ్డారు. పలు మండలాల్లో వాడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. దీంతో వరి, మామిడిపంటలు, కరెంట్ స్తంభాలు నెలకొరిగాయి. ఈ మేరకు పలు ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. నాగులుప్పలపాడు మండలాల్లో మిర్చికి తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు.






