TTD : తిరుమలను వక్ఫ్ బోర్డుతో పోల్చుతారా : ఒవైసీపై బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఫైర్

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2024-11-02 14:08:10  IST  )

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు(ttd) పట్ల ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్ధిన్ ఒవైసీ(Owaisi) చేసిన వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి(Vishnuvardhan Reddy) మండిపడ్డారు.

TTD : తిరుమలను వక్ఫ్ బోర్డుతో పోల్చుతారా : ఒవైసీపై బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్ : తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు(ttd) పట్ల ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్ధిన్ ఒవైసీ(Owaisi) చేసిన వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి(Vishnuvardhan Reddy) మండిపడ్డారు. హిందువుల అత్యంత పవిత్రమైన స్థలాన్ని వక్ఫ్ బోర్డు, వక్ఫ్ కౌన్సిల్ తో ఒవైపీ పోల్చడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. టీటీడీలో అన్యమతస్తులకు అవకాశం ఉండరాదన్న టీటీడీ చైర్మన్ వ్యాఖ్యలను తప్పబట్టిన విష్ణువర్ధన్ రెడ్డి.. మక్కాలో హిందువులు ఎవరు అడుగుపెట్టరన్న సంగతి మరిచిపోవద్ధన్నారు. మరి మీరు తిరుమలలో ప్రవేశించాలనుకుంటున్నారా అని, మీరు నిజంగా బాలాజీని విశ్వసిస్తున్నారా అంటూ విష్ణువర్ధన్ రెడ్డి ఒవైసీని నిలదీశారు.

Next Story