రిటర్న్ గిఫ్ట్ సంగతి దేవుడెరుగు? ముందు కుప్పంలో గెలవండి: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

by Disha Web Desk 21 |
రిటర్న్ గిఫ్ట్ సంగతి దేవుడెరుగు? ముందు కుప్పంలో  గెలవండి: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో : వైసీపీ ప్రభుత్వానికి మరో 6 నెలల్లో రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేసినవ్యాఖ్యలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కౌంటర్ ఇచ్చారు. రిటర్న్ గిఫ్ట్ దేవుడెరుగు ముందు కుప్పంలో చంద్రబాబు నాయుడు గెలవాలి కదా అంటూ సెటైర్లు వేశారు. అమరావతిలో బుధవారం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు గెలిచి చూపించాలని మంత్రి పెద్దిరెడ్డి సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులే గెలుపొందుతారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. వైసీపీపట్ల ప్రజలు సానుకూల దృక్పథంతో ఉన్నారని చెప్పుకొచ్చారు. అంతేకాదు సర్వేలన్నీ వైసీపీకి అనుకూలంగా ఉన్నాయని స్పష్టం చేశారు. మరోవైపు వైసీపీ రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతుందన్న ఆరోపణలను తిప్పి కొట్టారు. వైసీపీ ప్రభుత్వానికి ఎవరిపైనా కక్ష లేదని క్లారిటీ ఇచ్చారు. స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు నాయుడు ప్రమేయం ఉంది కాబట్టే సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పుకొచ్చారు. అంతేగానీ కక్ష సాధింపులో భాగంగా చంద్రబాబును జైలుకు పంపాల్సిన అవసరం తమకు లేదని చెప్పుకొచ్చారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజాప్రతినిధులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అంతేగానీ ప్రజాధనం కొల్లగొడితే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పుకొచ్చారు.

Read More Latest updates of Andhra Pradesh News



Next Story