జగన్ పాలనలో విహారయాత్రలు మినహా అభివృద్ధి ఎక్కడ?: యనమల రామకృష్ణుడు

by Disha Web Desk 21 |
జగన్ పాలనలో విహారయాత్రలు మినహా అభివృద్ధి ఎక్కడ?: యనమల రామకృష్ణుడు
X

దిశ , డైనమిక్ బ్యూరో : వైసీపీ పాలనలో సీఎం వైఎస్ జగన్ విహార యాత్రలు చేస్తున్నారే తప్ప అభివృద్ధి ఎక్కడా చేయడం లేదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు ఆరోపించారు. జగన్ పాలనలో అవినీతి అక్రమాలు పెరిగిపోయాయని ఆరోపించారు. రాజమహేంద్రవరంలో గురువారం యనమల రామకృష్ణుడు మీడియాతో మాట్లాడారు. పేదవాడి పేరు చెప్పి వైసీపీ నేతలు రాష్ట్రంలో వనరులన్నీ దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. వైఎస్ఆర్ జగనన్న కాలనీ అనేది పెద్ద స్కాం అని ఆరోపించారు.పేదవారికి ఇళ్ళ స్థలాల పేరుతో దోచుకుంటున్నారని చెప్పుకొచ్చారు. టీడీపీ ప్రభుత్వంలో కట్టిన ఇళ్లకు జగన్ ప్రభుత్వం రంగులు మార్చేసి గొప్పలు చెప్పుకుంటుందని ఆరోపించారు. టీడీపీ హయాంలో పూర్తి చేసిన టిడ్కో ఇళ్లను ఇప్పటికీ లబ్ధిదారులకు ఇవ్వకుండా ప్రభుత్వం మోసం చేస్తోందని ఆరోపించారు. పూర్తికాని ఇళ్లకు ప్రారంభోత్సవాలు చేస్తూ పేద ప్రజలను జగన్ మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. నవరత్నాలు పేరుతో వైఎస్ జగన్ చేస్తున్న మోసాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి పీఠం నుంచి జగన్‌ను ఎప్పుడు కిందకు దించుతారా అని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారని చెప్పుకొచ్చారు. నవరత్నాలు పేరుతో ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనారిటీలను సీఎం వైఎస్ జగన్ మోసం చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు పేదరికం తగ్గించగలిగాయా..? అసమానతలను తగ్గించగలిగాయా? అని ప్రశ్నించారు. వైఎస్ జగన్ రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసిన ఘనుడు అని ధ్వజమెత్తారు. ఏపీ అప్పులు 11 లక్షల కోట్లు దాటిపోయాయని...రూ.270 కోట్లు రుషికొండ క్యాంపు కార్యాలయం కోసం ఖర్చు పెట్టారని మండిపడ్డారు. జగన్ పాలనలో రెండు లక్షల కోట్లు అవినీతి జరిగిందని యనమల రామకృష్ణుడు ఆరోపించారు. వైసీపీ పాలనలో జరిగిన అవినీతి అక్రమాలపై న్యాయస్థానంలో పోరాటం చేస్తామని... దోచుకున్న సొమ్మును కక్కించి తీరుతామని అన్నారు. వైసీపీ పాలనలో హౌసింగ్ నిర్మాణాలపై జగన్ శ్వేతపత్రం విడుదల చేయాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు.



Next Story