నాకు ఏ బాధ్యతలు ఇచ్చినా నిర్వర్తిస్తా: మాజీ సీఎస్ సోమేశ్‌ కుమార్‌

by Disha Web Desk 7 |
నాకు ఏ బాధ్యతలు ఇచ్చినా నిర్వర్తిస్తా: మాజీ సీఎస్ సోమేశ్‌ కుమార్‌
X

దిశ, డైనమిక్ బ్యూరో : కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం తాను ఆంధ్రప్రదేశ్‌ క్యాడర్‌కు వచ్చినట్లు సీనియర్ ఐఏఎస్ అధికారి, తెలంగాణ మాజీ సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ వెల్లడించారు. ఏపీ ప్రభుత్వం తనకు ఏ బాధ్యతలు ఇచ్చినా చిత్తశుద్ధితో నిర్వర్తిస్తానని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి రిపోర్ట్ చేసేందుకు గురువారం విజయవాడ విమనాశ్రయం చేరుకున్న సీఎస్ సోమేశ్ కుమార్ ఒక అధికారిగా డీవోపీటీ ఆదేశాలు పాటిస్తానని స్పష్టం చేశారు.

అయితే వీఆర్ఎస్ తీసుకుంటారంటూ వస్తున్న వార్తలపై సమాధానం ఇచ్చారు. ఇంకా అలాంటి ఆలోచన ఏదీ చేయలేదని.. కుటుంబ సభ్యులతో చర్చించిన తర్వాతే తన నిర్ణయం ప్రకటిస్తానన్నారు. ప్రస్తుతం ఉద్యోగం చేసేందుకే వచ్చినట్లు మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ వెల్లడించారు. అనంతరం ఎయిర్ పోర్ట్ నుంచి సీఎస్ కార్యాలయానికి చేరుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. అనంతరం రిపోర్ట్ చేశారు.

Also Read...

ఏపీ ప్రభుత్వానికి సోమేష్ కుమార్ రిపోర్ట్!

Next Story