- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- వైరల్
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- IPL2023
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- ఆరోగ్యం
- ఫోటోలు
- Job Notifications
- OTT Release
- భక్తి
Home > ఆంధ్రప్రదేశ్ > పశ్చిమగోదావరి > Ap News: టీడీపీకి భారీ షాక్ .. వైసీపీ గూటికి మాజీ ఎమ్మెల్యే పసల
Ap News: టీడీపీకి భారీ షాక్ .. వైసీపీ గూటికి మాజీ ఎమ్మెల్యే పసల
by Disha Web |

X
దిశ, డైనమిక్ బ్యూరో: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత పసల కనక సుందరరావు వైసీపీ గూటికి చేరారు. అసెంబ్లీలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ సమక్షంలో పలువురు నేతలతో కలిసి ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. మాజీ ఎమ్మెల్యే పసల కనక సుందరరావుతోపాటు ఇతర నేతలకు సీఎం జగన్ వైసీపీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని జగన్ సూచించారు.
ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ప్రభుత్వ చీఫ్విప్ ముదునూరి ప్రసాదరాజు పలువురు నేతలు పాల్గొన్నారు.
Next Story