గోదావరి నది ఒడ్డున మొసళ్ల కలకలం.. స్థానికులు ఏం చేశారంటే..

by Vemula.Srinu Prasad |

పోలవరం జిల్లా పోచవరం బోటింగ్ పాయింట్ వద్ద రెండు మొసళ్ల కలకలం రేగింది. ..

గోదావరి నది ఒడ్డున మొసళ్ల కలకలం.. స్థానికులు ఏం చేశారంటే..
X

దిశ, వెబ్ డెస్క్: పోలవరం జిల్లా(Polavaram District) వి.ఆర్.పురం మండలం పోచవరం బోటింగ్ పాయింట్(Pochavaram Boating Point) వద్ద రెండు మొసళ్ల(Crocodiles) కలకలం రేగింది. గోదావరి నది(Godavari River)లో నుంచి బయటకు వచ్చి సేద తీరుతున్నాయి. అయితే పాపి కొండల విహార యాత్ర(Papi Hills tour)కు వచ్చిన పర్యాటకులకు ఈ రెండు మొసళ్లు కనిపించాయి. ఓ మొసలి నీళ్లలోకి వెళింది. రెండోది మాత్రం అలానే ఉండిపోయింది. దీంతో భయాందోళనలకు గురయ్యారు. స్థానికులతో కలిసి మిగిలిన మొసలిని తాళ్లతో బంధించి నదిలోకి విడిచిపెట్టారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Next Story