భీమవరంలో తాటిచెట్టు పడి యువకుడు మృతి

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-06-05 13:34:04  IST  )

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గుణుపూడి సమీపంలోని గరువుపేటలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది..

భీమవరంలో తాటిచెట్టు పడి యువకుడు మృతి
X

దిశ, భీమవరం: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గుణుపూడి సమీపంలోని గరువుపేటలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రాజ్కుమార్ (29) అనే యువకుడిపై ప్రమాదవశాత్తు తాటిచెట్టుకూలి మీద పడటంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడికి భార్య, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ సంఘటనపై వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Next Story