పెళ్లివేడుకలో ఓ జంటపై యువకుల దాడి.. నర్సాపురంలో ఉద్రిక్తత

by Vemula.Srinu Prasad |

పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది...

పెళ్లివేడుకలో ఓ జంటపై యువకుల దాడి.. నర్సాపురంలో ఉద్రిక్తత
X

దిశ, వెబ్ డెస్క్: పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం(Narsapuram)లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గురువారం రాత్రి నర్సాపురంలో పెళ్లి వేడుక(Marriage Function) జరిగింది. ఈ వేడుకలో ఓ జంటపై యువకులు దాడి చేశారు. దీంతో శుక్రవారం రెండు వర్గాల(Two Groups) మధ్య ఘర్షణ జరిగింది. రాళ్లు రువ్వుతూ, కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. ఈ మేరకు వారిని ఆస్పత్రికి తరలించారు.

విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామంలో పికెటింగ్ ఏర్పాటు చేశారు. అయితే పోలీసుల ఎదుటు కూడా దాడులు చేసుకున్నారు. చివరకు రెండు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపు చేశారు. ఈ ఘటనతో నర్సాపురంలో టెన్షన్ వాతావరం నెలకొంది. మళ్లీ దాడులు పునరావృతం కాకుండా పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు.

Next Story