Tragedy: 16 నెలల చిన్నారి ప్రాణం తీసిన చెట్లు

by Disha Web Desk 16 |
Tragedy: 16 నెలల చిన్నారి ప్రాణం తీసిన చెట్లు
X

దిశ, వెబ్ డెస్క్: ఈదురుగాలు చిన్నారి ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. తల్లి ఒడిలో ఉన్న చిన్నారిపై మృత్యువు చెట్ల రూపంలో విరుచుకుపడింది. ఈ ఘటన ఏలూరు జిల్లా మర్రిబంధం గ్రామంలో జరిగింది. కొంతమంది ప్రయాణికులు రోడ్డుపై ఆటోలో వెళ్తున్నారు. ఈ సయంలో ఒక్కసారిగా ఈదురుగాలులు వీచాయి. దీంతో రోడ్డుపై వెళ్తున్న ఆటోపై చెట్లు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో 16 నెలల చిన్నారి మృతి చెందింది. ముగ్గురు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వీరందరిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చిన్నారి మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ ఘటనతో అటు వారి స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇవి కూడా చదవండి : మళ్లీ భయపెడుతున్న కరోనా.. తాడేపల్లిలో ఇద్దరికి పాజిటివ్

Next Story