పోలవరం నిర్వసితులకు గుడ్ న్యూస్.. రూ. 306.61 కోట్ల పరిహారం అందజేత

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-05-15 16:00:44  IST  )

పోలవరం నిర్వాసితులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ తెలిపారు. రూ.306.61 కోట్ల పరిహారాన్ని అందజేశారు...

పోలవరం నిర్వసితులకు గుడ్ న్యూస్.. రూ. 306.61 కోట్ల పరిహారం అందజేత
X

దిశ, వెబ్ డెస్క్: పోలవరం(Polavaram) నిర్వాసితులకు సీఎం చంద్రబాబు(Cm Chandrababu) గుడ్ న్యూస్ తెలిపారు. రూ.306.61 కోట్ల పరిహారాన్ని అందజేశారు. అలాగే ఆర్ అండ్ ఆర్ కాలనీ(R and R Colony)లకు సంబంధించి లబ్ధిదారులకు ఇళ్ల తాళాలనూ అందించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. మొత్తం ఇళ్ల పట్టాల కోసం 62.05 ఎకరాలు ల్యాండ్ టు ల్యాండ్ కింద 520.02 ఎకరాలను గుర్తించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగోసారి పరిహారాన్ని అందించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ గంగా-కావేరి నదుల అనుసంధానం చేయాలనేది తన కల అని తెలిపారు. ఇలా జరిగితే దేశంలో ఎక్కడా కూడా నీటి ఎద్దడి ఉండదని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

Next Story