- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
మీడియా ప్రతినిధులపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం: అచ్చెన్నాయుడు
దిశ, డైనమిక్ బ్యూరో : సీబీఐ విచారణకు హాజరుకాకుండా కుంటి సాకులు చెప్పి పారిపోతున్న అవినాష్ రెడ్డి బాగోతాన్ని కవర్ చేస్తున్న మీడియా ప్రతినిధులపై వైసీపీ రౌడీలు దాడి చేయడాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఓ ప్రకటనలో తెలిపారు. విధి నిర్వహణలో ఉన్న మీడియా ప్రతినిధులపై దాడి చేసిన వైసీపీ గూండాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అని పోలీసులను కోరారు.
జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పత్రికా స్వేచ్చను హరిస్తూనే ఉన్నారు అని విమర్శించారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తున్న పత్రికలపై జగన్ రెడ్డి అక్కసు వెళ్లగక్కుతున్నారు అని మండిపడ్డారు. దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేయడంతోపాటు తక్షణమే వారిని అరెస్ట్ చేయాలి అని అచ్చెన్నాయుడు ప్రకటనలో డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి : మీడియా ప్రతినిధులపై MP అవినాష్ రెడ్డి అనుచరుల దాడి
- Tags
- Achchennaidu
- TDP