గెలుస్తామని నమ్మకం ఉంటేనే టికెట్లివ్వమని అడిగాం : మంత్రి సీదిరి అప్పల‌రాజు

by Disha Web Desk 1 |
గెలుస్తామని నమ్మకం ఉంటేనే టికెట్లివ్వమని అడిగాం : మంత్రి సీదిరి అప్పల‌రాజు
X

దిశ, వెబ్‌డెస్క్ : గుడివాడ అమర్‌నాథ్, తను గెలవడం ముఖ్యం కాదని, మేము గెలుస్తామని నమ్మకం ఉంటేనే టికెట్లు ఇవ్వమని జగనన్నను అడిగామని మంత్రి సీదిరి అప్పల‌రాజు స్పష్టం చేశారు. నిరుపేదలకు న్యాయం జరగాలంటే వైసీపీ ప్రభుత్వం మళ్లీ రావాలని పేర్కొ్న్నారు. సంక్షేమ పథకాలు నిరాటంకంగా కొనసాగాలంటే జగనన్నే రాష్ట్రాన్ని పరిపాలించాలని ఆకాంక్షించారు. పేదలు, ధనికుల మధ్య చంద్రబాబు ఆధునిక అంటరానితనాన్ని ప్రోత్సహించారని ఆరోపించారు. ఎన్నికలు వచ్చాయి కాబట్టే నారా భువనేశ్వరి రాష్ట్రం అంతటా తిరుగుతున్నారని దుయ్యబట్టారు. టీడీపీ హయాంలో మత్స్యకారులకు న్యాయం జరగలేదని, కేవలం జగన్ హయాంలోనే అన్ని వర్గాలకు న్యాయం జరిగిందని మంత్రి అప్పలరాజు అన్నారు.

Next Story

Most Viewed