Anakapalli: బస్సును ఢీకొట్టిన లారీ.. ఒకరు మృతి, ఐదుగురికి సీరియస్

by Disha Web Desk 16 |
Anakapalli: బస్సును ఢీకొట్టిన లారీ.. ఒకరు మృతి, ఐదుగురికి సీరియస్
X

దిశ, డైనమిక్ బ్యూరో: అనకాపల్లి జిల్లా ఎత్రాయిపల్లి మండలం ధర్మవరం వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అనకాపల్లి నుంచి పాయకరావుపేటకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ధర్మవరం వద్ద ప్రయాణికులను ఎక్కించుకునేందుకు ఆగింది. అదే సమయంలో వెనకనుంచి వచ్చిన లారీ బలంగా బస్సును ఢీ కొట్టింది. దీంతో బస్సు అదుపుతప్పి ముందు ఉన్న మరో ఆటోను ఢీకొట్టి పంటకాలువలోకి దూసుకెళ్లింది. ఈ సమయంలో బస్సులో సుమారు 50 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇందులో 20మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. అక్కడే విధులు నిర్వహిస్తున్న పోలీసులు, స్థానికులు క్షతగాత్రులను నక్కపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి ఆటోల్లో తరలించారు.

అయితే విశాఖలోని ఇసుకతోటకు చెందిన పరసయ్య (55) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రాథమిక చికిత్స అనంతరం వారిని మెరుగైన చికిత్స కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు.



Next Story